
Sanam teri kasam 2: సూపర్హిట్ మూవీ సీక్వెల్.. పాకిస్థాన్ నటి తొలగింపు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: సూపర్హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ (Sanam Teri Kasam 2) నుంచి పాకిస్థాన్ నటి మావ్రా హొకేన్ (Mawra Hocane)ని మేకర్స్ తీసేశారు. ‘ఆపరేషన్ సిందూర్’కు
వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దర్శక, నిర్మాతలు రాధికా రావు, వినయ్ ప్రకటన విడుదల చేశారు. అన్నింటికంటే దేశం ముఖ్యమన్నారు. ‘‘ఏ రకమైన ఉగ్రవాదాన్నైనా
ఖండించాల్సిందే. భారతీయ సినిమాల్లో నటించి.. ఎంతో ప్రేమ, అభిమానం పొందిన వారు టెర్రర్ అటాక్ను ఖండించకపోవడం బాధాకరం. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను కొందరు విమర్శించేంత వరకూ
వెళ్లారు. మేం మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. జైహింద్’’ అని నోట్లో పేర్కొన్నారు. * ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టు మావ్రా కామెంట్స్పై ఆ మూవీ హీరో హర్షవర్ధన్
రాణే (Harshvardhan Rane) ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆమె ఉంటే తాను నటించేందుకు సిద్ధంగా లేనని వెల్లడించారు. ‘‘ఏ దేశానికి చెందిన నటీనటులనైనా నేను గౌరవిస్తా. కానీ, నా
దేశాన్ని ఉద్దేశించి ఎవరైనా చులకనగా మాట్లాడితే సహించను. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గినా ఫర్వాలేదు కానీ.. దేశ గౌరవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తే ఊరుకోను. నీ దేశానికి మద్దతుగా నిలబడటం
మంచిదే. అలా అని పక్క దేశంపై విషపూరిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు’’ అని హర్షవర్ధన్ హితవు పలికారు. రొమాంటిక్ డ్రామా ‘సనమ్ తేరీ కసమ్’ 2016లో విడుదలైంది. తొలుత రూ.16 కోట్లు వసూలు చేసిన ఈ
ఇటీవల రీ రిలీజ్లో రూ.41 కోట్లు వసూలు చేయడం విశేషం.