
Ntr: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: సౌదీ అరేబియాలో ఎన్టీఆర్ (NTR) సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ,
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, సినీనటి ప్రభ, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలీ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్
విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్రవేశారన్నారు. ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది..
గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్నే అని చెప్పారు. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారని కొనియాడారు. సినిమాల్లో ఆయన నటించేవారు అనేకన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్ అని
చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఏం చెప్పారో అదే చేశారన్నారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారని వివరించారు. అన్నగారి శతజయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకున్నామని.. ఇప్పుడు సినీ
వజ్రోత్సవ వేడుకలు ప్రతి దేశంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నందమూరి బెనర్జీ అన్నారు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరొకరు అందుకోలేరని
చెప్పారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్యకు ఆయన అభినందనలు తెలిపారు. నటి ప్రభ మాట్లాడుతూ ఎన్టీఆర్తో కలిసి హీరోయిన్గా నటించినందుకు తనపై ఇంత ప్రేమ, గౌరవం
చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన టీడీ జనార్దన్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోని ఎన్నో విశేషాలతో ‘తారకరామం’
పుస్తకం రాయడం అభినందనీయమని ప్రభ కొనియాడారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నందమూరి కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కడుపు నిండిపోతోందని చెప్పారు. నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రల్లో ఎన్టీఆర్
అద్వితీయ నటన చూపించారని.. పోషించిన ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా మారారన్నారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను దేశవిదేశాల్లో ముందుండి నిర్వహిస్తున్న టీడీ జనార్దన్కు అభినందనలు తెలిపారు. సౌదీ
అరేబియాలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారికి రామకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు కోనేరు ఉమా మహేశ్వరరావు, ఈవెంట్ ఛైర్ కందిబేడల వరప్రసాద్, ‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’ కార్యవర్గ సభ్యులు నాగశేఖర్ చందగాని, శర్మ చివుకుల, కేవీఎన్ రాజు,
దిలీప్ నాట్యం, రోహిత్నంద, కిశోర్ అద్దంకి, సలీంషేక్, హరికిషన్, ఎన్వీబీకే కిశోర్, మాజీద్, పాపారావు జుజ్జవరపు, శివ సిరిగిన, శ్రీనివాస్ గుబ్బాల, మనోహర్ ప్రసాద్, విజయ్కుమార్
సుంకవల్లి, అనిత చెందగాని, రాజ్యలక్ష్మి, భ్రమర, శారద, కాశ్మీరతో పాటు పలు తెలుగు సంస్థలు సహాయ, సహకారాలతో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ నెట్వర్క్ వైస్
ఛైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.