
Rr vs pbks: మళ్లీ పోరాడి ఓడిన రాజస్థాన్.. ప్లే ఆఫ్స్కు చేరువైన పంజాబ్
Play all audios:

జైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 12 మ్యాచ్ల్లో ఎనిమిదో విజయం
అందుకున్న పంజాబ్ (17 పాయింట్లు) ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 209/7కు
పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (50; 25 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (40; 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చినా రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. తర్వాత
వచ్చిన సంజు శాంసన్ (20; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), రియాన్ పరాగ్ (13; 11 బంతుల్లో 1 సిక్స్) దూకుడుగా ఆడలేకపోయారు. ధ్రువ్ జురెల్ (53; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా మిగతా
బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ కీలక సమయంలో (3/22) వికెట్లు తీసి రాజస్థాన్ను దెబ్బకొట్టాడు. యాన్సెన్, ఒమర్జాయ్ రెండేసి
వికెట్లు పడగొట్టారు. జైస్వాల్, సూర్యవంశీ చెలరేగినా యశస్వి జైస్వాల్, సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అర్ష్దీప్ వేసిన ఇన్నింగ్స్ తొలి
ఓవర్లో జైస్వాల్ వరుసగా నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాదేసి 22 పరుగులు పిండుకున్నాడు. యాన్సెన్ బౌలింగ్లో వైభవ్ రెండు సిక్సర్లు, ఓ సిక్స్ రాబట్టాడు. బార్ట్లెట్ బౌలింగ్లో జైస్వాల్ మూడు బౌండరీలు
బాదడంతో మూడు ఓవర్లకే స్కోరు 50 దాటింది. అర్ష్దీప్ వేసిన నాలుగో ఓవర్లో సూర్యవంశీ ఒక ఫోర్, రెండు సిక్స్లు బాదేశాడు. ఈ క్రమంలో వైభవ్ దూకుడుకు హర్ప్రీత్ బ్రార్ చెక్ పెట్టాడు. మరోవైపు,
జైస్వాల్ దూకుడు కొనసాగించడంతో 8 ఓవర్లకే స్కోరు 100 దాటింది. 24 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి.. హర్ప్రీత్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. శాంసన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ
క్రమంలో జురెల్, పరాగ్ నిలకడగా ఆడటంతో 13 ఓవర్లకు రాజస్థాన్ 143/3 పటిష్ఠస్థితిలో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లోనే పరాగ్ను హర్ప్రీత్ క్లీన్బౌల్డ్ చేశాడు. హెట్మయర్ (11; 12 బంతుల్లో)
నెమ్మదిగా ఆడినా జురెల్ దూకుడు కొనసాగించడంతో రాజస్థాన్ విజయం దిశగా సాగింది. చివరి రెండు ఓవర్లలో విజయ సమీకరణం 30 పరుగులు కాగా.. 19వ ఓవర్లో అర్ష్దీప్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్లో
యాన్సెన్ 11 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. నేహల్ వధేరా (70; 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు), శశాంక్
సింగ్ (59*; 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకాలు బాదడంతో భారీ స్కోరు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (21; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (30; 25 బంతుల్లో 5 ఫోర్లు),
అజ్మతుల్లా ఒమర్జాయ్ (21*; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ప్రియాంశ్ ఆర్య (9), మిచెల్ ఒవెన్ (0) నిరాశపర్చారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, క్వెనా మఫాక, రియాన్
పరాగ్, ఆకాశ్ మధ్వాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.