
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి
Play all audios:

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద
ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారేపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన శారద(38), ఆమె కుమారుడు కార్తీక్ (13) అక్కడికక్కడే మృతి
చెందారు. గాయపడిన తండ్రిని ఆసుపత్రిలో చేర్చి కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.