Hyderabad: బ్యాండ్‌ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..

Hyderabad: బ్యాండ్‌ సిబ్బందినీ వదలని ఎస్సై.. రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి..

Play all audios:


హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకి చెందిన జారీ కమల్‌ బ్యాండ్‌ సిబ్బంది


జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్‌ వాయించారు. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆ బ్యాండ్‌కు చెందిన వాహనాన్ని, సామగ్రిని ఎస్సై శంకర్‌ సీజ్‌ చేశారు.  వాహనం,


సామగ్రి తిరిగి ఇచ్చేందుకు రూ.15వేలు డిమాండ్‌ చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్‌ను మధ్యవర్తిగా పెట్టుకొని.. ఆ మొత్తాన్ని అతనికి ఇవ్వాలని బాధితుడికి సూచించాడు. ఎస్సై వేధింపులు తాళలేక


బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బాధితుడు రూ.15వేల నగదును మధ్యవర్తి నాగేందర్‌కు అందజేశాడు. అతడు ఆ మొత్తాన్ని ఎస్సైకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా


పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్సై శంకర్‌, అతనికి సహకరించిన నాగేందర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.