
Ipl playoffs: ప్లేఆఫ్స్ రేసును తేల్చే కీలక మ్యాచ్ నేడే.. గెలిచేదెవరు? నిలిచేదెవరు?
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) ప్లేఆఫ్స్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్
కింగ్స్ (Punjab Kings) .. టాప్ 4లోకి దూసుకెళ్లాయి. దీంతో మిగిలిఉన్న ఒకే ఒక స్థానం కోసం.. ముంబయి (Mumbai Indians), దిల్లీ (Delhi Capitals) పోటీ పడుతున్నాయి. నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగే
మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ రేసులో కీలకం కానుంది. దిల్లీకి సంకటం.. ముంబయి (14), దిల్లీ (13) పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో జట్టు ఇంకా రెండేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
అందులో ఈరోజు జరగబోయే పోరు కీలకం. ఈ మ్యాచ్లో ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్లోకి చేరుతుంది. ఎందుకుంటే తర్వాతి మ్యాచ్లో దిల్లీ గెలిచినా.. దాని ఖాతాలో చేరే పాయింట్లు 15
మాత్రమే. దిల్లీ ప్లేఆఫ్స్కు చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్లు గెలివాలి. దీంతో ఈ రోజు ఫలితం ముంబయికి అనుకూలంగా వస్తే ఇక ప్లేఆఫ్స్ రేసు ముగిసినట్లే. ముంబయి ఒడితే.. ఇక నేటి మ్యాచ్లో ముంబయి
ఓడితే.. దిల్లీకి అవకాశాలు ఉంటాయి. అయితే తర్వాత మ్యాచ్లో దిల్లీ తప్పక గెలవాల్సి ఉంటుంది. అప్పుడే 17 పాయింట్లతో ముంబయిని దాటి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఇవాళ మ్యాచ్లో ఓడినా
ముంబయికి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే తదుపరి మ్యాచ్లో దిల్లీ కచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ముంబయి ఖాతాలో 16, దిల్లీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఆ లెక్కన ముంబయి ప్లేఆఫ్స్కి
చేరుతుంది. ఆ జట్ల మధ్య టాప్ 2 పోరు.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు.. టాప్ 2లో నిలిచేందుకు పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు ఇంకో రెండేసి మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో
టాప్ 2లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్ 1లో ఓడినా.. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడే
అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి మ్యాచ్, ప్రతి పాయింట్, రన్రేట్ ఆయా జట్లకు కీలకం కానుంది.