Earthquake: తుర్కియేలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

Earthquake: తుర్కియేలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలో భూకంపం సంభవించింది. కొన్యా ప్రావిన్సులోని కులు జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. రాజధాని


అంకారాతోపాటు సమీప నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని, రెస్క్యూ


బృందాలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం ఏఎఫ్‌ఏడీ వెల్లడించింది. గ్రీస్‌లో బుధవారం ఉదయం కూడా 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.


అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. ఈజిప్టుతోపాటు ఇజ్రాయెల్‌, లెబనాన్‌, తుర్కియే, జోర్డాన్‌లలోనూ ప్రకంపనలు సంభవించాయి. తాజాగా అంకారా సమీప నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ప్రపంచంలో అత్యంత


ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాలలో వినాశనం సృష్టించింది. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. కేవలం తుర్కియేలోనే 59వేల మంది


మృత్యువాత పడగా.. సిరియాలో దాదాపు 8వేల మంది మరణించారు.