
Airspace: భారత్- పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ.. పాక్ గగనతలం ఓపెన్
Play all audios:

భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గగనతలంలో అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు తాజాగా పాకిస్థాన్ ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి
రావడంతో గగనతలంలో అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు తాజాగా పాకిస్థాన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోయిన వేళ పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (పీఏఏ) (PAA) ఈ మేరకు ఓ
ప్రకటన జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. * ఉగ్రవాదంపై పోరు.. సహకారంపై రష్యా పూర్తి హామీ - భారత్ ‘‘విమాన ప్రయాణానికి దేశవ్యాప్తంగా అన్ని
విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు తమ తాజా షెడ్యూల్ కోసం సంబంధిత విమానయాన సంస్థను సంప్రందించాలి. శనివారం నుంచి పాక్ గగనతలాన్ని అన్ని రకాల విమానాల కోసం పూర్తిగా
పునరుద్ధరించాం. దీంతో విమానాశ్రయాల నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయి’’ అని పీఏఏ వెల్లడించింది. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య కొన్ని రోజులుగా పాక్ తన గగనతలాన్ని మూసివేసిన విషయం
తెలిసిందే..