ప్రకృతి అందాల మధ్య కొలువైన రామలింగేశ్వర స్వామి శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం!

ప్రకృతి అందాల మధ్య కొలువైన రామలింగేశ్వర స్వామి శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం!

Play all audios:


Reported by: Published by: Last Updated:June 26, 2023 5:47 PM IST ANDHRA PRADESH: ఈ కాలపు ఆలయాలు చుట్టూ ప్రహరీతో కట్టు దిట్టంతో కనిపిస్తాయి. కానీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మాత్రం


ప్రకృతి ఒడిలో ఉంటుంది. X ప్రకృతి ఒడిలో బుగ్గ రామేశ్వరాలయం (Santosh, News18, Peddapalli) ఈ కాలపు ఆలయాలు చుట్టూ ప్రహరీతో కట్టు దిట్టంతో కనిపిస్తాయి. కానీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మాత్రం


ప్రకృతి ఒడిలో ఉంటుంది. ఆరు బయట ఆంజనేయ స్వామి, దాని ముందు దేవాలయం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలతో ప్రకృతి ఒడిలో ఉంటంది. వినడానికే ఇంత సుమదరంగ ఉంటే అక్కడి వెళ్లి చూస్తే ఇంకెంత హాయిగా ఉంటుంది.


ఇప్పుడు ఆ దేవాలయం విశిష్టతపై న్యూస్ 18 ప్రత్యేక కథనం. పచ్చటి ప్రకృతి ఒడిలో వెలసిన దేవాలయం, త్రేతా యుగంలో రాముడుచే ప్రతిష్ట చేయబడిన శివలింగం, సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన


శివలింగంగా రామలింగేశ్వరుడుగా పూజలు అందుకునే ప్రసిద్ది చెందిన దేవాలయం, శివలింగాన్ని దర్శనం చేయడానికి స్వయంగా గంగా దేవి వచ్చిన స్థలం, భూమిలో నుండి బుగ్గ రూపంలో బయటకు వచ్చిన గంగతో బుగ్గ


రామలింగేశ్వరుడుగా చరిత్ర ఎక్కిన దేవాలయం, పాపనాశక తీర్ధంగా పూజలు అందుకుంటున్న ఆ పవిత్ర ప్రదేశమే పెద్దపల్లి జిల్లాలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. advertisement శ్రీ బుగ్గ రామలింగేశ్వర


స్వామి దేవస్థానం పెద్దపల్లి జిల్లాలోని బసంత నగర్ లో పచ్చటి ప్రకృతి అందాలలో కొలువైన వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన రామలింగేశ్వరుడు. ఈ ఆలయం పెద్దపల్లి నుండి రామగుండం వచ్చే దారిలో అంతర్గం వెళ్ళే


దారిలో చుట్టూ గుట్టల నడుమ పచ్చటి ప్రకృతి అందాలతో పక్షుల కిల కిల రాగాలు చేస్తూ ఎంతో ఆహ్లాదాకరమైన ప్రదేశంలో పెద్ద పెద్ద వృక్షాల మధ్యలో ఈ దేవాలయం ఉంది. ఎంతో చారిత్రక చరిత్ర కలిగిన ఈ


రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ వెలసిన కొన్ని వందల ఏళ్ల తరువాత ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగి కూడా కొన్ని వందల ఏళ్లు అయింది అయినా చెక్కు చెదరకుండా ఉంది. advertisement చరిత్ర చెబుతున్న


కథ.. త్రేతాయుగంలో శ్రీరాముడు రవాణా సహరం తరువాత బ్రహ్మ హత్య పరిహారార్థం అనేక చోట్ల శివ లింగాలు ప్రతిష్టించారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో బసంత నగర్ సమీపంలో దట్టమైన అడవిలో శివలింగాన్ని


ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. శివలింగాన్ని ప్రతిష్టించిన తరువాత ఆ అడవిలో నీరు లేకపోవడంతో శ్రీరాముడు తన బాణంతో ఒక కొండను కొట్టగా ఆ కొండ నుండి నీరు పరవల్లై పొంగుతూ రాగా ఆ నీరుతో అభిషేకం


చేసి శివానుగ్రం పొందాడట. అక్కడ ఇప్పటికీ 24 గంటల నీరు వస్తూనే ఉంటుంది. బుగ్గ నుండి గంగ బుడగ రూపంలో ఆవిర్భవించడం వల్ల రాముడు స్థాపించడం వల్ల రామలింగేశ్వర స్వామిగా భక్తులు పిలుస్తారు. ఈ


ప్రాంతంలో ప్రతిష్టించబడిన శివ లింగం, గంగతో పాటు, చెట్లను కూడా పూజిస్తారు. Location : Telangana First Published : June 26, 2023 5:47 PM IST Read More