
Ipl 2025: మే 13 నాటికి అన్ని జట్ల ఆటగాళ్లు రెడీగా ఉండాలి.. ఫ్రాంఛైజీలతో బీసీసీఐ
Play all audios:

కాల్పుల విరమణ అంగీకారంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి తెరపడింది. ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ అంగీకారంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి తెరపడింది. దీంతో ఐపీఎల్
(IPL) 2025ను పునః ప్రారంభించే దిశగా బీసీసీఐ (BCCI) ప్రయత్నాలు మొదలుపెట్టింది. మంగళవారం (మే 13)లోగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మినహా అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు తమ వేదికల్లో (హోం
గ్రౌండ్లు) అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ
మౌఖికంగా తెలియజేసినట్లు సమాచారం. తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను తెలియజేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రాంఛైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
మే 13 వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 25నే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తోందట. మిగిలిన 12 లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో త్వరగా
ముగించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. పంజాబ్ కింగ్స్కు తటస్థ వేదిక కేటాయిస్తారని భోగట్టా. అయితే, ఆ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మే 15 లేదా 16న
ఐపీఎల్ 2025 సీజన్ పున: ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.