
Chandrababu: కెంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Play all audios:

బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్-2ను ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలోని సౌకర్యాలను అధికారులు సీఎంకు వివరించారు.
రానున్న రోజుల్లో ఏపీలోని ఎయిర్పోర్టులను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. టెర్మినల్-2ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయటం ఆకట్టుకుందన్నారు.
విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని ఏకీకృతం చేయడం బాగుందన్నారు. విమానాశ్రయంలోని కార్యాచరణ అంశాలు, ఇతర సౌకర్యాలపై అధికారులతో సీఎం చర్చించారు.