
Ttd: తిరుమలలో ఎల్లుండి నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం: మంత్రి ఆనం
Play all audios:

తిరుమలలో ఎల్లుండి (గురువారం) నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల: తిరుమలలో ఎల్లుండి (గురువారం) నుంచి వీఐపీ సిఫారసు లేఖలు
స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తెలుగురాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఎల్లుండి నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పారు. మే 1 నుంచి జులై 15 వరకు
సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు గతంలో తితిదే ప్రకటించింది. ప్రజాప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే
బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ గడువును తగ్గించి మే 15 నుంచి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం
రామనారాయణరెడ్డి తెలిపారు.