
Punjab: కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: పంజాబ్ (Punjab)లో ఘోరం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (Spurious Liquor) తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్సర్లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 14
మంది మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన నిందితుడైన ప్రభ్జీత్సింగ్తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశాం. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో
నిందితుడి పేరు వెల్లడైంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. ఎక్కడినుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నాం. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టాం.
కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.