Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 27 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 27 మంది మావోయిస్టుల మృతి

Play all audios:


చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నారాయణపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.


మరి కొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మాధ్‌ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ


డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత! అబుజ్మడ్‌లోని బటైల్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు


జరుగుతున్నాయి. అక్కడ  మావోయిస్టు అగ్ర నాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సమాచారం. అతడిపై రూ.కోటిన్నర రివార్డు


ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్‌లోని నాలు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. అబుజ్మడ్‌ ఎన్‌కౌంటర్‌ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు. మృతుల


సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట.. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు


నిర్వహించారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌


చదివాడు. ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ అధిపతిగా కూడా పనిచేశాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో అతడు దిట్ట. ఐఈడీల


వినియోగంలో నిపుణుడు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో నంబాల చురుకుగా ఉన్నాడు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి ఘటనకు ఇతడు సూత్రధారి. నంబాల ఉన్నారన్న సమాచారంతోనే


మాధ్‌ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఘటనా ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఆయాధాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సహాయకుడు మృతి..


ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు


సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన విషయం తెలిసిందే


వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.