
India- pak: భారత్, పాక్ చర్చలు వాయిదా.. మోదీ-డోభాల్ ప్రత్యేక భేటీ
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం కీలక చర్చలు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం అవి
వాయిదా పడ్డాయి. ఈ సాయంత్రం 5 గంటలకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (డీజీఎంవో)ల మధ్య హాట్లైన్లో చర్చలు జరుగుతాయి. (India-Pak
DGMO level talks). అయితే, వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు, ప్రధాని మోదీ నివాసంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు
అజిత్ డోభాల్, త్రివిధ దళాల అధిపతులు, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు సమావేశమయ్యారు. మోదీ-డోభాల్ ప్రత్యేక సమావేశం తన నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మోదీతో అజిత్ డోభాల్
ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్, పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. డీజీఎంవో చర్చల నేపథ్యంలో ఆదివారం మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి
తెలిసిందే. పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంపై పాక్తో ఎలాంటి చర్చలు
ఉండవని ప్రధాని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC)
వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది.