
Kl rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్
Play all audios:

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) టీ20ల్లో మరో రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL
Rahul) చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బ్రేక్ చేశాడు.
కోహ్లీ 243 ఇన్నింగ్స్ల్లో 8 వేల పరుగుల మైలురాయి అందుకోగా.. రాహుల్ 224 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)
మధ్య జరిగిన మ్యాచ్లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓవరాల్గా టీ20ల్లో వేగంగా 8 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్
క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ (218) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లీ, పాక్ బ్యాటర్ మహ్మద్
రిజ్వాన్ (244) ఉన్నారు.