
Jasprit bumrah: జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీకి అర్హుడు కానీ.. : అశ్విన్
Play all audios:

టీమ్ఇండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు నిర్వహించే అర్హత బుమ్రాకు ఉందని రవిచంద్రన్ అశ్విన్
అభిప్రాయపడుతున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ ఫార్మాట్కు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవలే కొన్ని రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు తమ రిటైర్మెంట్లను
వరుసగా ప్రకటించారు. జూన్లో టీమ్ఇండియా (Team India) అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపికతో పాటు.. భారత జట్టుకు సారథిని ఎన్నుకునే
బాధ్యత సెలక్టర్లపై ఉంది. జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అభిప్రాయపడుతున్నాడు. కానీ
మరోవైపు శుభ్మన్గిల్ (Shubman Gill) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇలా ఒకేసారి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారో నాకు తెలియదు. ఇది నిజంగా ఇండియన్
క్రికెట్కు పరీక్ష సమయం. ఇకపై టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలకం కానున్నాడు. ఇంగ్లండ్లో పర్యటించబోయే భారత జట్టులోని ఆటగాళ్లు దాదాపు కొత్తవాళ్లు. ఈ టీమ్లో బుమ్రానే
సీనియర్. నా అభిప్రాయం ప్రకారం అతడికి కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదే’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్తో అన్నాడు. రో- కో ద్వయం నిష్క్రమణ తర్వాత
టీమ్ఇండియా ముందున్న సవాళ్ల గురించి కూడా ఈ లెగ్ స్పిన్నర్ మాట్లాడాడు. ‘విరాట్, కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత భారతజట్టులో సారథ్య శూన్యత ఆవహించింది. ఇంగ్లండ్ టూర్ ముంగిట అనుభవానికి ఎంతో
ప్రాధాన్యం ఉంది. దాన్ని మనం కొనలేం. ఏదిఏమైనా మనం ఈ టూర్లో విరాట్ ఎనర్జీని, రోహిత్ శర్మ వ్యూహాలను మిస్ కానున్నాం’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.