Ipl 2025: ఆ మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Ipl 2025: ఆ మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు ప్రస్తుతానికి ఆగిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచులను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని


బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వేదికగా వాటిని నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  భారత ప్రభుత్వం అనుమతిస్తే...  భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల


నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. బీసీసీఐ ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దులకు దూరంగా దక్షిణాదికి చెందిన


ఆ మూడు నగరాల్లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.  మరింత కాలం వాయిదా?! ప్రస్తుతం ఐపీఎల్‌ 2025ను బీసీసీఐ ఓ వారంపాటు వాయిదా వేసింది. కానీ నిజానికి వారం తర్వాత


ఐపీఎల్‌ మ్యాచ్‌లను తిరిగి ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి బీసీసీఐ, ఆయా ఫ్రాంఛైజీలకు అనధికారికంగా తెలియజేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఈ ఏడాది చివరి వరకు మ్యాచ్‌లు వాయిదా


పడే అవకాశమే ఎక్కువగా ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు తిరిగి రాకపోవచ్చు! విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఇప్పటికే వారి స్వస్థలాలకు పయనమయ్యారు. వీరిలో కొంతమంది త్వరలోనే


అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఐపీఎల్‌ 2025 తిరిగి ప్రారంభమైనా వారు రావడం అనుమానాస్పదమే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు జూన్‌ 11 నుంచి టెస్ట్‌ ఛాంపియన్‌


షిప్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ తిరిగి ప్రారంభమైనా ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొనడం సందేహమే.