
Mock drill: మాక్డ్రిల్ అలర్ట్ 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుంది: సీవీ ఆనంద్
Play all audios:

మాక్డ్రిల్ నిర్వహణకు హైదరాబాద్ అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4గంటల నుంచి ఐసీసీసీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని వారందరికీ మెసేజ్ వెళ్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
వెల్లడించారు. హైదరాబాద్: మాక్డ్రిల్ నిర్వహణకు హైదరాబాద్ అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4గంటల నుంచి ఐసీసీసీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని వారందరికీ మెసేజ్ వెళ్తుందని నగర పోలీస్
కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుందని చెప్పారు. ఈ సైరన్ మోగిన వెంటనే ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్న
ఆయన.. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ప్రజల్ని
మానసికంగా సన్నద్ధం చేయడమే దీని ఉద్దేశమన్నారు. బయటకు రావొద్దు.. సురక్షిత ప్రదేశంలోనే ఉండండి! ‘‘సైరన్ మోగిన వెంటనే ప్రజలు ఇళ్లల్లో ఉంటే ఇంటికే పరిమితం కావాలి. బయటకు రావొద్దు. బయట ఉన్నవారు
సమీప ప్రాంతంలో ఏవైనా నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరుతున్నాం. వాహనాలపై ప్రయాణిస్తున్న వారైతే తమ వాహనాలను పార్క్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ
మాక్డ్రిల్. 15 నిమిషాల తర్వాత మరో మెసేజ్ ఐసీసీసీ నుంచి వెళ్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి ఘటన జరిగిన సందర్భంలో సివిల్ డిఫెన్స్ పరంగా ప్రభుత్వ విభాగాల అప్రమత్తత ఎలా ఉందో చెక్
చేయడానికి నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతుంది. గోల్కొండలోని నానల్నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీలలో జరిగే మాక్ డ్రిల్లో పోలీస్ , ట్రాఫిక్, హెల్త్,
రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రవాణా విభాగాలు పాల్గొంటాయి. వారు వ్యవహరించాల్సిన తీరుపై ఆదేశాలు వెళ్తాయి. మొత్తం ప్రక్రియకు ఐసీసీసీ ఒక నోడల్ సెంటర్గా ఉంటుంది. ఐసీసీసీ
నుంచి పరిస్థితిని మానటరింగ్ చేస్తాం. రాబోయే కొన్ని రోజుల పాటు సంబంధిత విభాగాల్లో ఎవరూ సెలవులు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలుపుతూ గురువారం ర్యాలీ
నిర్వహిస్తాం’’ అని సీవీ ఆనంద్ వివరించారు.