Ktr: కవిత లేఖ.. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ

Ktr: కవిత లేఖ.. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ

Play all audios:


సిద్దిపేట: భారాస (BRS) అధినేత కేసీఆర్‌తో (KCR) ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) భేటీ ఆయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ప్రత్యేకంగా కలిశారు.


ఎమ్మెల్సీ కవిత లేఖ, అనంతర వ్యాఖ్యలు, సంబంధిత పరిణామాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ రెండో తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల కేసీఆర్‌కు, ఆయన


కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అంతర్గతంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ బహిర్గతం కావడం, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ


వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌, కేటీఆర్‌ భేటీ అయినట్లు సమాచారం. జూన్‌ 1న అమెరికాలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్‌ ఈ నెల 28న వెళ్లనున్నారు.


ఈలోగా పార్టీ పరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా కేసీఆర్‌తో ఆయన చర్చించే అవకాశముంది.