Peethala murthy yadav: బొత్స వియ్యంకుడికి అడ్డగోలుగా టీడీఆర్‌ కట్టబెట్టారు: పీతల మూర్తియాదవ్‌

Peethala murthy yadav: బొత్స వియ్యంకుడికి అడ్డగోలుగా టీడీఆర్‌ కట్టబెట్టారు: పీతల మూర్తియాదవ్‌

Play all audios:


విశాఖ: వైకాపా హయాంలో భారీగా టీడీఆర్‌ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ (Peethala murthy yadav) ఆరోపించారు. మురికివాడల పేరిట టీడీఆర్‌ పేరుతో కోట్లు కోట్టేశారన్నారు.


‘‘బొత్స వియ్యంకుడు వెంకటరమణకు అడ్డగోలుగా టీడీఆర్‌ కట్టబెట్టారు. డాక్యుమెంట్‌ నెంబర్‌ 57/2007.. చెప్పాళ్లుప్పాడ, కాపులుప్పాడలో వెంచర్‌ వేశారు. 3,720 గజాల స్థలంలో 726 గజాలకు టీడీఆర్‌ ఇచ్చారు.


బొత్స అల్లుడికి జీవీఎంసీ నుంచి గిఫ్ట్‌ రూ.22 కోట్లు టీడీఆర్‌ ఇచ్చారు. 600 గజాలు రైల్వే న్యూకాలనీలో వైకాపా మాజీ నేత మరియా ఫాతిమా రాణికి ఇచ్చారు.  వైకాపా నేతలు జోసెఫ్‌ కుమార్‌, కిషోర్‌ కుమార్‌


తదితరులకు టీడీఆర్‌ కింద 4800 గజాలు కట్టబెట్టారు. ప్రత్యుపకారంగా వారు అధికారి విద్యుల్లతకు బహుళ అంతస్తుల ఫ్లాట్‌ ఇచ్చారు. వెంకటపతినగర్‌లో మురికివాడ పేరిట టీడీఆర్‌ కొట్టేయాలని చూస్తున్నారు.


రాష్ట్ర పట్టణ ప్రణాళిక అధికారి విద్యుల్లత టీడీఆర్‌లు చేయిస్తున్నారు. టీడీఆర్‌ కుంభకోణానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని పీతల మూర్తి యాదవ్‌ అన్నారు. (Andhra Pradesh News)