
43 years in prison: హత్యకేసులో 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు దశాబ్దాల కిందట ఓ హత్య, హత్యాయత్నం కేసుకు సంబంధించి నలుగురికి జీవిత ఖైదు పడింది. శిక్ష అనుభవిస్తున్న క్రమంలోనే ముగ్గురు మరణించగా.. ఓ ముద్దాయికి ఇటీవల ఊరట లభించింది.
ఈ కేసుల్లో అతడు నిర్దోషిగా తేలడంతో 43 ఏళ్ల శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం ఆయన వయసు 104 ఏళ్లు కావడం గమనార్హం. ఉత్తర్ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని గౌరాయే గ్రామంలో 1977 ఆగస్టు
16న రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రభూ సరోజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో లఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ
ప్రయాగ్రాజ్లోని జిల్లా సెషన్స్ కోర్టు 1982లో తీర్పు ఇచ్చింది. * కోటాలోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు?.. ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం దీనిని సవాలు చేస్తూ నలుగురు నిందితులు
అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే, ఈ కేసు పెండింగులో ఉన్న సమయంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. మే 2, 2025న లఖాన్ను నిర్దోషిగా తేలుస్తూ
తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు రికార్డుల ప్రకారం.. లఖాన్ 1921 జనవరి 4న జన్మించగా.. 1977లో హత్య అభియోగాలపై అరెస్టయ్యాడు. ప్రస్తుతం ఆయన వయసు 104 ఏళ్లు.
మొత్తంగా 43 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఆయన విడుదలయ్యాడు. అదే జిల్లాలో షరీరా గ్రామంలో ఉంటున్న ఆయన కుమార్తెకు లఖాన్ను జైలు అధికారులు అప్పగించారు.