
Lic q4 results: ఎల్ఐసీ లాభం ₹19 వేల కోట్లు.. ఒక్కో షేరుకు ₹12 డివిడెండ్
Play all audios:

LIC Q4 results: ఎల్ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.19వేల కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. LIC Q4 results | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.19,013 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,763
కోట్లతో పోలిస్తే లాభంలో 38 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.2,50,923 కోట్ల నుంచి రూ.2,41,625 కోట్లకు తగ్గింది. ఈ మేరకు మంగళవారం రెగ్యులేటరీ పైలింగ్లో
పేర్కొంది. * సమీక్షా త్రైమాసికంలో ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు తగ్గాయి. జనవరి- మార్చి మధ్య రూ.11,069 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.13,810 కోట్లుగా ఉంది. *
రెన్యువల్ చేసిన ప్రీమియం వసూళ్ల వల్ల వచ్చే ఆదాయం పెరిగింది. ఈ మొత్తం రూ.77,368 కోట్ల నుంచి రూ.79,138 కోట్లకు పెరిగింది. * పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024-25) ఎల్ఐసీ రూ.48,151 కోట్ల నికర
లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.40,676 కోట్లుగా ఉంది. 18 శాతం వృద్ధి నమోదైంది. * పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం సైతం రూ.8,53,707 కోట్ల నుంచి రూ.8,84,148 కోట్లకు
పెరిగింది. * త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా పూర్తి ఆర్థిక సంవత్సరానికి బోనస్ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.12 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు సిఫార్సు చేసిందని ఎల్ఐసీ
పేర్కొంది.