Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Play all audios:


Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ వంటి


ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను కిందుకు లాగుతున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 235 పాయింట్ల నష్టంతో 82,295 వద్ద ట్రేడవుతుండగా..


నిఫ్టీ (Nifty) 51 పాయింట్ల నష్టంతో 25,010 వద్ద ఉన్నాయి.  సెన్సెక్స్‌ 30 సూచీలో.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా,


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌,


ఎటర్నల్‌, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.42 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్


బ్యారెల్‌ 64.51 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 3,213 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధమా? అమెరికా ప్రధాన సూచీలైన ఎస్‌ అండ్‌ పీ 500, డోజోన్స్ నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో


లాభంతో ముగియగా.. నాస్‌డాక్ మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎస్‌ 0.62 శాతం లాభంతో ట్రేడవుతుంటే.. జపాన్‌ నిక్కీ 0.25


శాతం, షాంఘై 0.54 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌ 0.75 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.5,393 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు


చేయగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,668 కోట్ల షేర్లు విక్రయించారు.