Stock market: స్వల్పనష్టాలతో ముగిసిన సూచీలు

Stock market: స్వల్పనష్టాలతో ముగిసిన సూచీలు

Play all audios:


Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) అస్థిరతల మధ్య కదలాడి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో సూచీలు మొదలవ్వగా.. ఆ తర్వాత కోలుకొన్నాయి. చివరకు


సెన్సెక్స్‌ 77.26 పాయింట్లు క్షీణించి 81,373 వద్ద స్థిరపడింది. అలాగే,  నిఫ్టీ సైతం 34.10 పాయింట్లు పతనమై 24,716.60 వద్ద ముగిసింది.   నిఫ్టీలో అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎటర్నల్, టాటా


కన్జ్యూమర్‌, పవర్ గ్రిడ్ కార్ప్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా..  హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. పీఎస్‌యూ


బ్యాంక్‌, రియాల్టీ రంగాల సూచీలు లాభపడగా.. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ, మెటల్‌ సూచీలు మాత్రం 0.5శాతం మేర తగ్గాయి. ఇకపోతే, డాలరుతో రూపాయి మారకం విలువ 85.38గా కొనసాగుతోంది.