Bangladesh: తెల్లవారుజామున 3 గంటలకు.. లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు..

Bangladesh: తెల్లవారుజామున 3 గంటలకు.. లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు..

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆ పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా


దేశం విడిచి భారత్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ (Bangladesh


Ex president Abdul Hamid) తాజాగా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన థాయ్‌లాండ్‌ విమానం ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం దర్యాప్తు


చేపట్టింది. అవామీ లీగ్‌ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన హమీద్‌ తొలుత ఎంపీగా ఎన్నికయ్యారు. 2013 నుంచి 2023 మధ్య హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు


చేపట్టారు. అయితే, గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారి హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం అవామీ


లీగ్‌ హయాంలో ఆందోళనకారులపై దాడులు, హత్యల ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మాజీ అధ్యక్షుడు హమీద్‌పై హత్య కేసు నమోదైంది. * ఫ్రీగా విమానం వస్తుంటే వదులుకోవడానికి


తెలివితక్కువ వాడినా?: ట్రంప్‌ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న 81 ఏళ్ల హమీద్‌ గతవారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కినట్లు కథనాలు వచ్చాయి. ఆయన వెంట సోదరుడు, బావ


కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో ఆయన దృశ్యాలు బయటకు వచ్చాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలో ఉన్న హమీద్‌ విమానాశ్రయానికి వచ్చినట్లుగా అందులో ఉంది. దీంతో యూనస్‌ ప్రభుత్వం


దర్యాప్తు చేపట్టింది. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. మరికొందరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఆయన వైద్య చికిత్స నిమిత్తం


థాయ్‌ వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే, విచారణ నుంచి తప్పించుకునేందుకే దేశం విడిచి పారిపోయినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అవామీ లీగ్‌ పార్టీని


నిషేధిస్తూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. అవామీ పార్టీ, దాని నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్‌ విచారణ పూర్తయ్యేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది.