Hari hara veera mallu: పవన్‌ సూచన.. ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత

Hari hara veera mallu: పవన్‌ సూచన.. ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత

Play all audios:


సినిమా టికెట్ ధరల పెంపు లేదా ఏ ఇతర విషయాలకు సంబంధించైనా సినీ పరిశ్రమకు చెందిన వారితో వ్యక్తిగత చర్చలకు తావులేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఒక ప్రకటన


విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్‌ సూచన మేరకు ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించారు. తన చిత్రానికి సంబంధించిన వినతిని


అందజేశారు. హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరల పెంపు సహా ఏ విషయానికి సంబంధించైనా వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపిన విషయం విదితమే.ఈ


నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ సూచన మేరకు ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించారు. మరో పది రోజుల్లో విడుదల కానున్న తమ చిత్రానికి టికెట్‌


రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి వంటి అంశాలపై తమ టీమ్‌ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించమని కోరుతూ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌కు ఒక లేఖను సమర్పించారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా


రూపొందుతున్న చిత్రమే ‘హరిహర వీరమల్లు’. పవన్‌కల్యాణ్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఇందులో పవన్‌ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. పలు కారణాల వల్ల కొంతకాలంగా వాయిదా


పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తయింది. క్రిష్‌, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాబీ దేవోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు:


పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్‌ 12న విడుదల కానుంది.