Theatres bandh: జూన్‌ 1న థియేటర్ల బంద్‌ లేదు: ఫిల్మ్‌ ఛాంబర్‌

Theatres bandh: జూన్‌ 1న థియేటర్ల బంద్‌ లేదు: ఫిల్మ్‌ ఛాంబర్‌

Play all audios:


జూన్‌ 1 నుంచి థియేటర్లను బంద్‌ చేయటం లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించింది. శనివారం ఈ మేరకు ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఇంటర్నెట్‌డెస్క్: జూన్‌ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో


సినిమా థియేటర్ల బంద్‌ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు,


ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ వెల్లడించారు. మీడియా ప్రతినిధులు


అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘థియేటర్ల బంద్‌ అనేది తప్పుగా చిత్రీకరించారు. చర్చలు జరగకపోతే, జూన్‌ 1వ తేదీ నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజం. కానీ, అందరూ


థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్‌లను బంద్‌ చేస్తున్నామనడం సరికాదు. కొన్ని వార్తలు బిజినెస్‌ను


దెబ్బతీస్తాయి. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ


జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్‌ మ్యాప్‌ ఏంటనేది నిర్ణయిస్తాం. మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈనెల 30న జరిగే సమావేశంలో కమిటీ


ఎవరనేది నిర్ణయిస్తాం’’ ‘‘థియేటర్ల బంద్‌ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, దాని ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారమే అధీకృతం. దానికి మేము సమాధానాలు చెబుతాం. ఎవరెవరి దగ్గరి నుంచో


మీడియా అభిప్రాయాలు తీసుకుని ఎవరి వెర్షన్‌ వారు రాసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాయడం సరికాదు. చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాలను త్వరలోనే


కలుస్తాం. వీలైనన్ని సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వంతోనూ చర్చిస్తాం. ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలను వివరిస్తాం’’ అని ఫిల్మ్‌ ఛాంబర్‌


కార్యదర్శి దామోదర ప్రసాద్‌ అన్నారు.