Ipl 2025: ముంబయి ఇండియన్స్‌కు పెనాల్టీగా నోబాల్‌

Ipl 2025: ముంబయి ఇండియన్స్‌కు పెనాల్టీగా నోబాల్‌

Play all audios:


ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఓ నిబంధనను అతిక్రమించింది. దీంతో అంపైర్లు ముంబయి ఇండియన్స్‌కు నోబాల్‌ను పెనాల్టీగా విధించారు.  ఇంటర్నెట్‌


డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో భాగంగా బుధవారం ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ రూల్‌ బ్రేక్‌ చేసినందుకు అంపైర్లు ముంబయి


ఇండియన్స్‌కు నోబాల్‌ను పెనాల్టీగా విధించారు. అయిదో ఓవర్లో మూడో బంతిని విల్‌జాక్స్‌ విసిరాడు. దాన్ని విప్రాజ్‌ నిగమ్‌ ఎదుర్కొన్నాడు. ఆ బాల్‌ను అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో


ఆఫ్‌సైడ్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లే ఉండటం దీనికి కారణం. నిబంధనల ప్రకారం ఆన్‌సైడ్‌లో అయిదుగురికి మించి ఫీల్డర్లు ఉండకూడదు. కాని ఉండటంతో అంపైర్‌ నోబాల్‌ను పెనాల్టీగా విధించాడు.  ఇక మ్యాచ్‌


విషయానికొస్తే... ఈ పోరులో సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) 73* పరుగులతో తన సత్తా చాటి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లకు 5


వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. బదులుగా దిల్లీ క్యాపిటల్స్‌ 18.2 ఓవర్లకు 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 59 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబయి


ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. దీంతో దిల్లీ క్యాపిటల్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.