Vijay deverakonda: మీ భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?.. : విజయ్‌ దేవరకొండ సమాధానమిదే

Vijay deverakonda: మీ భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?.. : విజయ్‌ దేవరకొండ సమాధానమిదే

Play all audios:


‘లైగర్‌’ (Liger) తర్వాత తాను ఎంతో మారానని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తెలిపారు. ఆ సినిమా రిజల్ట్‌ విషయంలో బాధపడ్డానని చెప్పారు. ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కింగ్డమ్‌’ (Kingdom)తో


ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఫిలింఫేర్‌’ మ్యాగజైన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో  వ్యక్తిగత,


వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘లైగర్‌’ తర్వాత తాను ఎంతో మారానని అన్నారు. దర్శకులు నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. పెళ్లి


గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నారు. ‘‘దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుకునేవాడిని. ‘లైగర్‌’తో ఆ


కల నెరవేరింది. కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కాకపోతే అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాం. మా కాంబోలో హిట్‌ రాలేదనే బాధ ఉంది. ఆ సినిమా నాకెన్నో పాఠాలు నేర్పింది. నన్నెంతో మార్చింది.


నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్‌ భాస్కర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. వారి విజయాలను నేనూ సెలబ్రేట్‌ చేసుకుంటా. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను నటించా. నన్ను


తన లక్కీ స్టార్‌గా అనుకుంటాడు. నాకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడు ఆయనే. ఆయనతో వర్క్‌ చేయడానికి ఎప్పుడూ ముందుంటా. ఆయన ఎంతో మంచి వ్యక్తి’’ అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. * సినిమా, రేసింగ్‌..


రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా.. అందుకే కీలక నిర్ణయం: అజిత్‌ అనంతరం ఆయన పెళ్లి, రష్మిక గురించి మాట్లాడారు. ‘‘రష్మికతో ఇంకా ఎన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని ఉంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి.


అందమైన నటి. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటా’’ అని వివరించారు. మీ జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?


అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదు’’ అని బదులిచ్చారు. ‘కింగ్డమ్‌’ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. జులై 4న ఈసినిమా విడుదల కానుంది. భాగ్యశ్రీ


బోర్సే కథానాయిక.