
Pm modi: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది.. 122వ మన్కీ బాత్లో ప్రధాని మోదీ
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఆదివారం మన్కీ బాత్ (Mann Ki Baat)
122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి మోదీ మన్కీ బాత్లో ప్రసంగించారు. ‘ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో
ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దీనిని తమ
జీవితాల్లో భాగం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సిందూర్ అని నామకరణం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం
చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం. * దిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల
భేటీ అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాలో తిరంగ యాత్రలు నిర్వహించారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారు’ అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టుల హింసాత్మక
చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్నారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం
సాధించామన్నారు. సంగారెడ్డి మహిళలు స్కైవారియర్స్.. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్కీ బాత్లో ప్రస్తావించారు. వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడాన్ని ఆయన
ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొంది.. పండ్ల తోటలపై పురుగుల మందులు ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. డ్రోన్ దీదీలను ‘స్కై వారియర్స్’ అని మోదీ
అభివర్ణించారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం గురించి మోదీ మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. విశాఖ ప్రకృతి సౌందర్యానికి
ప్రసిద్ధి, ఆ ప్రదేశంలో యోగా చేయడం అనుభూతిని మరింత గొప్పగా చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పెరిగిన సింహాల సంఖ్య.. దేశంలో సింహాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరుగుతోందని మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో
గుజరాత్లోని గిర్లో 674 నుంచి 891కి చేరిందన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లుగా ఎక్కువ మంది మహిళలను నియమించిన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలిచిందన్నారు.