Allu aravind: పవన్‌ మూవీ వేళ అది దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను: అల్లు అరవింద్‌

Allu aravind: పవన్‌ మూవీ వేళ అది దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను: అల్లు అరవింద్‌

Play all audios:


హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్‌ (Allu Aravind) స్పందించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆ


నలుగురు.. అంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టు చిత్రీకరించారు. ఆ నలుగురికి, నాకు సంబంధం లేదు. వారిలో నేను లేను. ‘ఆ నలుగురు’ అనే మాట 15 ఏళ్ల క్రితం


ప్రారంభమైంది. తర్వాత నలుగురు.. పది మంది అయ్యారు. అది ఎవరూ పట్టించుకోలేదు’’ అని పేర్కొన్నారు. నావి 15లోపే.. ‘‘ఆ నలుగురి వ్యాపారం నుంచి కొవిడ్‌ సమయంలోనే నేను బయటకు వచ్చేశా. తెలంగాణలో నాకు ఒకే


థియేటర్‌ (AAA సినిమాస్‌) ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో నావి 15 లోపే. లీజు పూర్తయ్యాక వాటిని రెన్యువల్‌ చేయొద్దని మా స్టాఫ్‌కి చెబుతుంటా. భవిష్యత్తులో అవి కూడా ఉండవు. సినిమాలు


నిర్మించడమే 50 ఏళ్లుగా నా వృత్తి. జూన్‌ 1 నుంచి థియేటర్లు మూసేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ స్పందన సమంజసమైంది. సింగిల్‌ స్క్రీన్స్‌ కష్టాల్లో


ఉన్నాయి. అయితే, యజమానులు.. ఫిల్మ్‌ ఛాంబర్‌ లేదా ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ని సంప్రదించాలి. థియేటర్లు మూసేస్తామనేది ఏక పక్ష నిర్ణయం. అందుకే ఆయా సమావేశాలకు నాకు వెళ్లాలనిపించలేదు’’ అని చెప్పారు. అది


దుస్సాహసమే.. ‘‘పవన్ కల్యాణ్‌ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోరాడుతున్న వ్యక్తి ఆయన. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గారు,


సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసిన వారే కదా కలుద్దాం’ అన్నారు. కానీ, ఛాంబర్‌ వాళ్లు ఎవరూ వెళ్లలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మనం వెళ్లి కలవాలి కదా! ఎవరూ వెళ్లలేదు’’ అని అన్నారు. పవన్‌ బాధలో అర్థం


ఉంది.. ‘‘మాది ప్రైవేట్ వ్యాపారం. ప్రభుత్వానికి సంబంధం లేదు’ ఎవరో అన్నారు. మరి ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు గత ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు?ఇది సరికాదు. ప్రభుత్వంతో మనకు సంబంధం ఉంది. మనకు


ప్రభుత్వ సహకారం కావాలి. మనకు కష్టం వస్తేగానీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలవమా..? ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశ్నలు సబబుగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్‌ బాధపడటంలో అర్థం ఉంది. ‘థియేటర్లు బంద్ చేయడం


అనేది ప్రత్యేకంగా పవన్ కల్యాణ్‌ సినిమాపై వ్యతిరేకతతో కాదు’ అని అంటారు గానీ.. ఇవన్నీ అనే ముందు అందరూ ఆలోచించుకోవాలి. నా సినిమా తీసుకెళ్లేది థియేటర్ ఓనర్ కాదు డిస్ట్రిబ్యూటర్. ఆ


డిస్ట్రిబ్యూటర్‌కి ఏం కావాలి? నిర్మాతకేం కావాలి? ఎగ్జిబిటర్‌కి ఏం కావాలి అనేది ఆలోచించాలి’’ అని సూచించారు. అందులో నాకు వాటా లేదు ‘క్యూబ్‌ కంపెనీలో నాకు వాటా లేదు. సురేశ్‌ బాబు చేతుల్లోనూ


లేదు’’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.