
Saw vs indw: ముక్కోణపు వన్డే సిరీస్.. సౌతాఫ్రికాపై విజయం.. ఫైనల్కు భారత్
Play all audios:

కొలంబో: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్కు చేరింది. ఇవాళ సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 23 పరుగుల తేడాతో విజయం
సాధించింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన సౌతాఫ్రికా.. శ్రీలంకతో జరగాల్సి ఉన్న సిరీస్ ఆఖరి మ్యాచ్లో గెలిచినా ఫైనల్కు చేరదు. ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. మ్యాచ్
విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేమిమా రోడ్రిగ్స్ (123; 101 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదేసింది. దీప్తి
శర్మ (93; 84 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకం అవకాశాన్ని చేజార్చుకుంది. స్మృతి మంధాన (51; 63 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ శతకం చేసింది. భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. 50
ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. అన్నరీ డెర్క్సెన్ (81; 80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), క్లో ట్రయాన్ (67; 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించారు. మియాన్ స్మిత్
(39), నొందుమిసో షాంగసే (36), తజ్మిన్ బ్రిట్స్ (26), నాడిన్ డి క్లర్క్ (22*), సినాలో జాఫ్తా (21) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2... శ్రీ చరణి, ప్రతీకా రావల్
ఒక్కో వికెట్ పడగొట్టారు.