Konaseema: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

Konaseema: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

Play all audios:


కోనసీమ: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం


ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్లి నదిలో


కొట్టుకుపోయారు. కె.గంగవరం మండలం శేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్‌ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు హాజరయ్యారు.


మధ్యాహ్న భోజనాల తర్వాత ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. వీరిలో ఎనిమిది మంది నదిలో గల్లంతయ్యారు. ముగ్గురు


ప్రాణాలతో బయటపడ్డారు.  (Konaseema News)