
Kim jong un: నౌక జల ప్రవేశం విఫలంపై కిమ్ గరం.. బాధ్యులపై కేసులు
Play all audios:

ఉత్తర కొరియాలో ప్రారంభించిన డిస్ట్రాయర్ నౌక ప్రారంభోత్సవానికి ముందే ఒరిగిపోవడంతో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర కొరియా (North Korea) అధినేత
కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కర్కశత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన. తాజాగా ఉత్తర కొరియాలో 5 వేల
టన్నుల సామర్థ్యమున్న డిస్ట్రాయర్ నౌక (Warship) ప్రారంభోత్సవానికి ముందే సమస్య తలెత్తి అది కదలకపోవడంతో కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులైన అధికారులను అరెస్టు చేస్తామని
ప్రకటించారు. అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. * హార్వర్డ్పై ట్రంప్ ఆంక్షలు.. గందరగోళంలో భారతీయ విద్యార్థులు గురువారం ఉత్తర కొరియా నావికా దళంలోకి కొత్త యుద్ధనౌకను
ప్రవేశపెట్టడానికి తూర్పు ఓడరేవు నగరమైన చోంగ్జిన్లో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. 5 వేల టన్నుల సామర్థ్యమున్న ఈ డిస్ట్రాయర్ నౌకను ప్రారంభించడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ ప్రత్యేక
అతిథిగా హాజరయ్యారు. ఆయన యుద్ధనౌకను ప్రారంభిస్తున్న సమయంలో ర్యాంపు నుంచి జారిపోయి.. ఫ్లాట్ కార్ కదలకపోవడంతో నౌక అడుగుభాగం దెబ్బతింది. దీంతో సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, షిప్యార్డ్
నిర్వాహకులపై కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తప్పు వల్ల దేశ గౌరవం దెబ్బతిందని.. ఇది నేరపూరిత చర్య అని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం బాధ్యతారాహిత్య చర్య వల్లే ఇలా జరిగిందని.. ఇందుకు
శిక్షగా నౌకను రూపొందించిన అధికారులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. జూన్లో తమ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరగనుందని.. అప్పటిలోపు నౌకను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ
చేశారు. ఈ యుద్ధ నౌకను వచ్చే ఏడాది ప్రారంభంలో నావికా దళంలో మోహరించాలని భావిస్తున్నట్లు కిమ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ 5వేల టన్నుల సామర్థ్యమున్న యుద్ధ నౌకను గత నెలలో ఉత్తరకొరియా
రూపొందించినట్లు పేర్కొంది. 2023 ఆగస్టులో అత్యవసర బేస్టింగ్ వ్యవస్థలోని లోపం కారణంగా మరో ఉపగ్రహ ప్రయోగం విఫలమయ్యిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది నవంబర్లోనూ.. ఉత్తర కొరియా సైనిక
ఉపగ్రహం గాలిలో పేలిపోయినట్లు వార్తలు వచ్చాయి.