
Chandrababu: చరిత్ర సృష్టించిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్: చంద్రబాబు
Play all audios:

యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానని ఏపీ సీఎం
చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అమరావతి: యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు జయంతి
సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. పేద ప్రజలకు కూడు, గూడు, దుస్తులు అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అని
కొనియాడారు. ‘‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారు. మండల వ్యవస్థతో పాలనారంగాన్ని
ప్రజల వద్దకు తీసుకెళ్లారు. పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారు. కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చారు. ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే.. ‘‘నా తెలుగు జాతి
సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి’’ అనే సంకల్పమే. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు.. చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్. ఈ నాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అది ఆయన
ఆశీర్వాదబలమే. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నాం. సమసమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం. అనితరసాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారకరామారావుకు మరోసారి
ఘన నివాళి అర్పిస్తున్నాను’’ అని తెలిపారు. (Andhra Pradesh News) ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారు: లోకేశ్ సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రయాణం మహాశక్తిగా మారిందని
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. సినీనటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రజా నాయకుడిగా పేదల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం
చేశారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ ప్రతి అడుగు నేటి తరానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.